టీఆర్ఎస్‌కు వస్తున్న ఆదరణ చూసే ఎమ్మెల్యేపై దాడి:బీజేపీపై హరీశ్‌ ఫైర్

236
harish rao
- Advertisement -

టి ఆర్ ఎస్ పార్టీ కి ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి , ఓర్వలేక బిజేపీ నాయకులు పని గట్టుకొని నియోజకవర్గం అవతల ప్రాంతంలో ఉన్న ఒక దళిత ఎమ్మెల్యే పై భౌతిక దాడులకు దిగడం శోచనీయం అన్నారు మంత్రి హరీశ్ రావు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడి హేయమైన చర్య .. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న అన్నారు.

ఇది ఉద్దేశ పూర్వకంగా పథకం ప్రకారం కావాలని , వాళ్ళు ఉంటున్న హోటల్ కి వెళ్లి వారి పై భౌతిక దాడులకు పాల్పడటం వారి దిగా జారుడు తనానికి నిదర్శనం అన్నారు. మాజీ ఎంపీ , దుబ్బాక బిజెపి ఎన్నికల ఇంచార్జ్ జితేందర్ రెడ్డి రామాయం పేట లోని రెడ్డి కాలనీ లో ఉంటే తప్పు లేనేది ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సిద్దిపేట లో ఉంటే తప్పు ఏంటి.. ఇది ఉద్దేశ పూర్వ క మైన దాడి అన్నారు.

నిన్న మొన్న కొన్ని యాక్షన్ ప్లాన్ చేశారు.. అందులో బాగమే ఈ కుట్ర.. బిజెపి నాయకులు శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. దాడికి ముందు 15 నిమిషాల ముందే పోలీస్ వాళ్ళు వచ్చి తనిఖీ చేసుకొని వెళ్లారు.. వాళ్ళ తనిఖీ ల సందర్భంగా ఎలాంటి ప్రచార సామగ్రి లేదు అన్నారు.టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు , పార్టీ శ్రేణులు సమయమనం పాటించి ఎవరీ పనుల్లో వారు నిమగ్నం అయి ఉండాలి..చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.

- Advertisement -