గ్రామస్తులతో ముచ్చటించిన మంత్రి హరీశ్‌ రావు

144
minister harishrao
- Advertisement -

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవానికి వెళ్లే సందర్భంగా తెలంగాణ – కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా బీదర్ లోని ఓ గ్రామం వద్ద ఆగి గ్రామస్థులతో ముచ్చటించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. తాగు, సాగు నీరు, విద్యుత్, రైతులకు అందుతున్న సాయంపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి. – అమ్మా బాగున్నారా… ఎలా ఉన్నారు‌ . మీది ఏ గ్రామం.
మహిళలు. – మాది కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ‌జాంబిగ గ్రామంలోని గ్రామ తండా వాసులం.
మంత్రి- మీకు పెన్షన్స్ ఇస్తోందా మీ ప్రభుత్వం ఎంత ఇస్తున్నారు.
మహిళలు – మా ప్రభుత్వం ఐదువందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు‌.
మంత్రి – తెలంగాణ రాష్ట్రంలోని మీ పక్కనే ఉన్న నారాయణఖేడ్ లో పెన్షన్ ఎంత ఇస్తున్నారో తెలుసా.
మహిళలు- మా వాళ్లు అక్కడ ఉన్నారు సార్. రెండు వేల రూపాయలు ఇస్తున్నారు‌.
మంత్రి – విద్యుత్ ఎంత సేపు ఇస్తున్నారు.
రైతు – ఐదారు గంటలు‌ కూడా‌ రావడం‌లేదు. కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది. నా ఐదేకరాల పంటకు నీరు పారాలంటే పది రోజులు పడుతుంది‌‌ సార్.
మంత్రి – పక్కనే నారాయణ ఖేడ్ లో కరెంటు ఎలా ఉంది.
గ్రామస్థులు- సార్ పక్కనే తెలంగాణ గ్రామాలు మాకు కనిపిస్తనే ఉంటుంది. 24 గంటలు కరెంట్ వస్తోంది. మేం చూస్తూనే ఉన్నాం. మా బాధలు‌ తెలుసుకునే వారే లేరు.
మంత్రి – అమ్మా ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ సందర్భంగా ప్రభుత్వ‌సాయం ఏమైనా అందుతుందా..
మహిళలు‌ – మాకేమీ ఇవ్వడం‌లేదు.
మంత్రి- మేం డెలివరీ ‌సందర్భంగా కేసీఆర్ ‌కిట్ అందజేస్తున్నాం.
మహిళలు- మీదగ్గర అన్నీ బాగా చేస్తున్నరు సార్.
మంత్రి – పెళ్లికి ఏమైనా సాయం చేస్తున్నరా..
మహిళలు- లేదు సార్ ఏదీ సాయం అందడం లేదు.
మంత్రి- నారాయణ ఖేడే లో పెళ్లికి సాయం అందుతుందా..
మహిళలు- మాకు తెలుసు‌సార్ , మా వాళ్లు ఉన్నారు. పెళ్లికి లక్ష రూపాయల సాయం అందుతోంది.
మంత్రి – మంచి నీటి సౌకర్యం అందుతుందా.. ? ఇంటింటికి తాగు నీరు ఇస్తున్నారా. ?
మహిళలు – కిలో మీటర్ దూరం నుండి ఇక్కడకు వచ్చి నీళ్లు పట్టుకుంటాం సర్. కరెంట్ వస్తే బిందలతో నీళ్లు తెచ్చుకుంటాం.
మంత్రి – వ్వవసాయానికి మీ ప్రభుత్వం సాయం చేస్తుందా. ?
రైతు- మాకు ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు‌.
మంత్రి- మేం‌ ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున, ఎన్ని ఎకరాలుంటే అన్ని ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం

- Advertisement -