కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోండి:మంత్రి హరీష్‌

191
harishrao
- Advertisement -

కరోనా బారీన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి, సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్స్ కి మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో రెండు వేల N95 మాస్క్ లు, 500ల పిపిఈ కిట్స్ ని అందచేశారు మహేశ్వర మెడికల్ కాలేజ్.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమకు తోచిన సాహాయం చేస్తున్న దాతలకి ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ భారిన పడకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వచ్చిన వారిని గ్రామాల్లోకి రానివ్వట్లేదు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎలా ఎప్పుడు ఎవరినుంచి కారోన సోకుతుందో తెలీదు కాబట్టి… అనవసరంగా బయట తిరగవద్దన్నారు.

- Advertisement -