యాదాద్రిని సందర్శించిన మంత్రి హరీష్‌ రావు..

157
Minister Harish Rao
- Advertisement -

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదివారం యాదాద్రి దేవాలయాన్ని సందర్శించారు. అలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అర్చకులు, అధికారులు ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం శ్రీలక్ష్మి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీష్‌.

అనంతరం స్వామి వారి ప్రత్యేక ఆశీర్వచనం తీర్థ ప్రసాదం అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, ఆలయ ఈఓ గీత, ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహా చార్యులు, మున్సిపల్ చైర్ పర్సన్ సుధ, జెడ్పీటీసీ అనురాధ, తదితరులు ఉన్నారు.

- Advertisement -