కేంద్రం ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదు- మంత్రి హరీశ్‌

38
harish
- Advertisement -

ఈరోజు కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా రాష్ట్ర వైద్య ఆర్యోగ శాఖ మంత్రి హరీశ్‌ రావు హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. నిత్యం కార్మికుల మధ్య శ్రమ జీవిలా కష్టపడే నాయకుడు వినయ్ భాస్కర్. ఒక నెల మొత్తం కార్మికుల సంక్షేమ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందనీయం అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కనీసం కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉజ్వల్ పథకం కింద సిలిండర్లు ఇచ్చామని ప్రచారమే తప్ప ఇచ్చింది లేదు. ధరలు పెంచిన కారణంగా పేదలు తిరిగి పోయ్యిల కట్టెలు కొంటున్నారు. నూనెల ధరలు ఆకాశాన్నంటాయని మంత్రి ఎద్దేవ చేశారు.

కార్మికులకు ఉచిత భీమా చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆటోలకు లైఫ్ టాక్స్ మాఫీ చేసిన ఘనత సీఎం కెసిఆర్ ది అన్నారు.భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిల్స్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
హెల్త్‌ సిటీకి వెళ్ళాం 12 వందల కోట్లతో 24 అంతస్థుల భవనం, 2 వేల పడకలు, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందులో ఉంటాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఏడాది లోగా ఆ హాస్పిటల్ ను పూర్తి చేస్తామన్నారు. మరో ఆరు నెలల్లో అన్ని రకాల పరికరాలు అందిస్తాం. అలాగే హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదు. ఈ హెల్త్ క్యాంప్ ద్వారా కార్మికులు లబ్ధి పొందాలని ఆకాంక్షిస్తున్నాను అని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు.

- Advertisement -