పట్టుబడ్డ డబ్బులు బీజేపీవే: మంత్రి హరీశ్‌ రావు

248
harish rao
- Advertisement -

దుబ్బాకలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని రోజుకో వేషం వేస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన హరీశ్… రాష్ట్ర పథకాల్లో కేంద్రం నిధులంటూ గోబెల్స్ ప్రచారం చేసింది వాటిని తిప్పికొట్టాం….. నిధుల్లో వాస్తవాలు ఉంటే రండి అంటే డిఫెన్స్ లో పడిపోయారని తెలిపారు.

కొద్ది రోజులుగా బిజెపి గ్రామ శాఖలు టిఆర్ ఎస్ లో విలీనం అవుతున్నాయి.… కిరాయి నాయకులు, కార్యకర్తలతో నామినేషన్ వేశారని చెప్పారు.మా నాయకుల ఇళ్లపై రైడ్ చేస్తే సహకరించాము.…. రెండు చోట్ల టిఆర్ఎస్, రెండు చోట్ల బిజెపి నేతల ఇళ్లపై దాడులు చేశారని తెలిపారు. మాకొచ్చిన సమాచారం మేరకు వెళ్లి రైడ్ చేస్తే డబ్బులు దొరికాయని సిపి స్టేట్ మెంట్ ఇచ్చారు.. వీడియో ఫుటేజ్ ఉందని చెబుతున్నారు… పోలీసు అధికారులను డిమాండ్ చేస్తున్నాం.. ఆ వీడియో ఫుటేజ్ విడుదల చేయాలి.… లేదంటే బీజేపీ మరిన్ని గోబెల్స్ ప్రచారం చేస్తారన్నారు.

చెయ్యనిది చెసినట్లు చెప్పడం, జరగంది జరిగినట్లు చెప్పడం బీజేపీ కి అలవాటు…… స్పష్టంగా, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
బీజేపీ నాయకులు కార్యకర్తల్లో విశ్వాసం కోల్పోయారు…బీజేపీ సోషల్ మీడియా ద్వారా ఉదయం నుంచి ఎనిమిది చోట్ల రైడ్స్ అంటూ గత్తర గత్తర చేస్తున్నారని దుయ్యబట్టారు.

పోలీసులే డబ్బులు పెట్టారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు… కేంద్ర హోం మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ల ట్రాప్ లో పడ్డారు…. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. డబ్బులతో పట్టుబడ్డ వ్యక్తే అవి బీజేపీ అభ్యర్థివని, ఎన్నికల ఖర్చు కోసం అంటూ చెప్పారు….దీనికేం సమాధానం చెబుతారని తెలిపారు. బీజేపీ వాళ్లు రెచ్చగొట్టినా టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. బీజేపీ రెచ్చగొట్టినా ఏ మాత్రం రెచ్చిపోవద్దు.. నిబంధనల మేరకు అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.

- Advertisement -