బీజేపీ నేతలపై మంత్రి హరీశ్ ధ్వజం..

96
minister harish
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరం నీళ్లు పారలేదని తొండి మాటలు చెప్పే బీజేపీ నాయకులు.. సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు రండి. ఎక్కడెక్కడ నీళ్లు పారాయో.. చెరువులు, కుంటలు నిండాయో.. రుజువులు చూపిస్తామని హరీశ్‌ సవాల్ చేశారు. శుక్రవారం ఆయన సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. ఈనేపథ్యంలో గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మర్కుక్‌లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ శంకుస్థాపన, విలేజ్ ఫంక్షన్ హాల్ ప్రారంభం, అలాగే సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవనానికి మంత్రి హరీశ్‌ శంకుస్థాపన చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ ఆఫీసులలో ఏదైనా పని ఉంటే అన్నీ కార్యాలయాలు ఒకేచోట ఉండాలని, ప్రజలకు ప్రభుత్వ అధికారుల సేవలు సులభంగా అందాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాన్నీ ఒకేచోట అందుబాటులో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని హరీశ్‌ తెలిపారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనిని టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది. సీఎం కేసీఆర్ మానవతావాదిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే రోగి బంధువులకు మూడు పూటలా భోజనం పెట్టిస్తున్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్రం రాకముందు 99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2 కోట్ల 59 మెట్రిక్ టన్నులు ధాన్యం పండిందని మంత్రి హరీశ్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరం నీళ్లు పారలేదని బీజేపీ తొండి మాటలు చెప్పే నాయకులు.. సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు రండి. ఎక్కడెక్కడ నీళ్లు పారాయో.. చెరువులు, కుంటలు నిండాయో.. రుజువులు చూపిస్తామని హరీశ్‌ సవాల్ చేశారు.

పేద ప్రజల కోసం పని చేసేది టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం. సొంత ఇంటి అడుగు జాగలో ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు త్వరలోనే మంజూరు చేస్తాం. పామాయిల్ తోటలకై సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు సబ్సిడీ పెట్టారని రైతులు విరివిగా సాగు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి హరీశ్‌.

ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -