ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం- మంత్రి హరీశ్‌

74
- Advertisement -

ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం వికారాబాద్‌, పరిగిలో పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 9200 గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ ఈ నెలలో ఉంటుంది. అందరూ అన్ని పోస్టులకు పరీక్ష రాసేందుకు వీలుగా ఒక దాని తర్వాత మరొక నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు.

ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారు. పట్టు బట్టి, ఢిల్లీ పోయి ఒప్పించారు. 33 శాతం పోలీసు ఉద్యోగాలు మహిళలకు కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొన్న సివిల్స్ లో ర్యాంకులు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. లక్ష్యం సిద్ధించాలంటే, చిత్తశుద్దితో పని చేయాలి. బాగా చదవాలి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అని విద్యార్థులకు మంత్రి సూచించారు.

- Advertisement -