టీఆర్ఎస్‌కు త‌ప్ప డూప్లికేట్ వాళ్ల‌కు ఓట్లు వేయొద్దు..

161
minister harish
- Advertisement -

ఆప‌ద‌లో ఉండేవాళ్లు కావాలా..? ఓట్ల కోసం వ‌చ్చేవాళ్లు కావాలా..? మీరే ఆలోచించుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు మంత్రి హ‌రీష్ రావు సూచించారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 17వ‌ వార్డులో మంత్రి హ‌రీష్ రావు ఆదివారం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ.. 17వ వార్డులో కాలికి మ‌ట్టి అంట‌కుండా రోడ్లు వేశాం. మ‌నిషి పుట్టుక నుంచి చావు వ‌ర‌కు అనేక వ‌స‌తులు క‌ల్పించామ‌న్నారు.

ఒక‌నాడు సిద్దిపేట‌లో నీళ్ల గోస చూశాం. పిల్ల‌ను ఇవ్వాలంటేనే ఆలోచించేవారు. ఇప్పుడు ఆ స‌మ‌స్య లేదు. ప్ర‌తి ఇంటికీ మంచినీరు అందిస్తున్నామ‌ని తెలిపారు. సిద్దిపేట ప‌ట్ట‌ణం అభివృద్ధికి చిరునామాగా మారింద‌న్నారు. ప‌ట్ట‌ణంలో కుక్క‌లు, కోతులు, దోమ‌ల బెడ‌ద లేకుండా చేశామ‌న్నారు. టీఆర్ఎస్‌కు త‌ప్ప డూప్లికేట్ వాళ్ల‌కు ఓట్లు వేయొద్దు. ప‌గ‌టి వేష‌గాళ్ల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్దు అని మంత్రి హ‌రీష్ రావు సూచించారు.

- Advertisement -