రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ శంకుస్థాపన..

197
Minister Harish Rao Lays Foundation Stone For Road Works
- Advertisement -

సిద్ధిపేట: పట్టణాభివృద్ధిలో భాగంగా మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల అభివృద్ధికై దశల వారీగా రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని 22, 25, 29వ మున్సిపల్ వార్డుల్లో రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం మధ్యాహ్నం మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా 22వ వార్డు పరిధిలోని సాయి విద్యానగర్ కాలనీ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.

అనంతరం 25వ వార్డులో మెదక్ రోడ్ పోచమ్మ దేవాలయం నుంచి పద్మనాయక ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్డు వరకూ రూ.49.90 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో బీటీ రోడ్డు, ఆ తర్వాత 29వ వార్డు పరిధిలోని గాడిచర్లపల్లి బస్ స్టాప్ నుంచి ఎల్లమ్మ కట్ట వరకూ సీసీ రోడ్డు నిర్మాణం, ఎల్లమ్మ దేవాలయం నుంచి ఎస్సీ కాలనీ వరకూ రూ.65.80 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,వివిధ వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

కరోనా దృష్ట్యా వృద్ధులు బయటకు రావొద్దు..

పట్టణంలోని వివిధ వార్డుల్లో రోడ్ల నిర్మాణాలకు వెళ్లిన మంత్రి అక్కడి వృద్ధులతో కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాసేపు ముచ్చటించారు.ఇప్పట్లో కరోనా పోయేటట్లు లేదని,ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని,ప్రభుత్వ సూచనలు,ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని స్థానికులకు కరోనాపై అవగాహన కల్పించారు.ఆర్టీసీ బస్సుల్లో,ఆటోలు,ప్రయివేటు వాహనాల్లో జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తిరగొద్దని ప్రజలకు సూచించారు.

- Advertisement -