సెంట్ర‌లైజెడ్ కిచెన్‌ను ప్రారంభించిన హ‌రీష్..

58
harish rao
- Advertisement -

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ. 5 కే భోజనం అందించే కార్యక్రమాన్ని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి వేదికగా గత నెలలో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ ఆసుపత్రుల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ ను ప్రారంభించారు హ‌రీష్ రావు.

హ‌రే కృష్ణ మూవ్‌మెంట్‌తో క‌లిసి ల‌క్ష‌ల మంది ఆక‌లి తీర్చుతున్నాం అని తెలిపారు. హైద‌రాబాద్‌లోని 18 దవాఖానలకు అన్ని జిల్లాల నుంచి చికిత్స కోసం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు..వారితో పాటు వారి అటెండెంట్స్ రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకొని రోగుల‌కు, వారి స‌హాయ‌కుల‌కు భోజ‌నం అందిస్తున్నామ‌ని చెప్పారు హ‌రీష్ రావు.

- Advertisement -