TRS ప్రభుత్వంలో నిజమైన రైతురాజ్యం వచ్చింది..

217
Minister Harish Rao distributed passbooks
- Advertisement -

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్‌లో సిద్దిపేట రూరల్ మండలం 209 మందికి, సిద్దిపేట అర్బన్ మండలంలోని 305 మందికి ఈ రోజు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు వచ్చాక మొదటిసారి పట్టాల పంపిణీ జరగుతుంది.రైతులు పెద్ద మనసుతో సహకరించి కాలువల భూ సేకరణకు సహకరించాలి. ఎంతోమంది రైతులు సహకరిస్తేనే కాళేశ్వరం నీళ్లు ఇక్కడి వరకు వచ్చాయన్నారు మంత్రి హరీష్.

భూ సేకరణకు రైతులు స్వచ్చందంగా ముందుకు రావాలి. గతంలో పేలిపోయి ట్రాన్స్ఫార్మర్స్, కాలిపోయి మోటార్లతో పంటలు పండించి రైతులు ఖర్చుల పాలు అయ్యేవారు.కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం లో నిజమైన రైతురాజ్యం వచ్చింది. యాసంగి పంట అంటే ఎండకుండ పండేది కాదు. యాసంగిలో ఎండకుండా పండింది ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్లాలి అని మంత్రి హరీష్‌ కోరారు.

- Advertisement -