చిరంజీవి మృతి తీర‌ని లోటు : మ‌ంత్రి హ‌రీష్

218
- Advertisement -

తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి మృతి పట్ల ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి మృతి తెలంగాణ‌కు తీర‌ని లోటు అన్నారు. కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో,విద్యార్థులంద‌రినీ కూడ‌గ‌ట్టి 1969 ఉద్య‌మంలో చిరంజీవి కీల‌క‌పాత్ర పోషించార‌ని మంత్రి గుర్తుకు చేసుకున్నారు.

గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న చిరంజీవి గ‌చ్చిబౌలి ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. చిరంజీవి మృతిప‌ట్ల ప‌లువురు నాయ‌కులు సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

- Advertisement -