పేదలకు నాణ్యమైన వైద్యం అందిచడమే మా లక్ష్యం- మంత్రి హరీష్‌

105
minister harish
- Advertisement -

గురువారం దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ఐసియు భవనం, నూతన ఆపరేషన్ థియేటర్స్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మేఘ ఇంజీనీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ వారి సహకారంతో వీటిని నిర్మించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ… దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారు. దుర్గాభాయ్ దేశముఖ్ ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకొని పోవాలని మంత్రి అన్నారు.

ఆరోగ్య శ్రీ నిధుల విడుదల ఆలస్యం లేకుండా చర్యలు తీకుంటున్నం.. ఇంకా తొందరగా విడుదల అయ్యేట్టు చూస్తున్నాం. 6 నెలల క్రితం ఆక్సిజన్ దొరుకక ఇబ్బంది కలిగినప్పుడు మేఘ కృష్ణ రెడ్డికి చెప్తే క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నామన్నారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి వారికి ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరుపు నుంచి అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు..పేదలకు నాణ్యమైన వైద్యం అందిచడమే మా లక్ష్యం అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -