- Advertisement -
ఇవాళ యోగా డే సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఇందలో భాగంగా మంత్రి కాసేపు యోగా మంత్రి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగాను దినచర్యలో భాగంగా చేసుకొని దీర్ఘాయుష్షును పొందాలన్నారు. ప్రపంచంలో చాలామందికి ఆహారం అలవాట్లతోనే రోగాలు వస్తాయన్నారు. యోగాతో రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు యోగా సాధన చేయవచ్చని తెలిపారు.
- Advertisement -