సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి గంగుల..

74
- Advertisement -

కరీంనగర్ పట్టణానికి మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు ఈరోజు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్, హుస్నాబాద్, చొప్పదండి శాసనసభ్యులు సతీష్ బాబు, సుంకే రవి శంకర్ లు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్ల‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2023 సంవత్సరంలో రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, వరంగల్‌, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నూతన మెడికల్‌ కాలేజీల స్థాపన కోసం ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.

- Advertisement -