సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్ః మంత్రి గంగుల

457
Gangula Kamalakar
- Advertisement -

దేశంలో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్ స్ధానంలో ఉందన్నారు సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. మంత్రులు గంగుల కమలాకర్ , శ్రీనివాస్ గౌడ్ సంక్షేమ భవన్ లో రాష్ట్ర రాజధానిలో నిర్మించ తలపెట్టిన వెనుకబడిన తరగతుల కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ గారు మాట్లాడుతూ.. గత కొన్ని దశాబ్దాల కాలంలో సమైక్యాంద్ర ప్రభుత్వంలో వెనుక బడిన తరగతుల సంక్షేమం విషయంలో సవతి ప్రేమ చూపెట్టింది అనేది వాస్తవం. మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెనుకబడిన తరగతుల కులాల కు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.. అందులో భాగంగా రాష్ట్ర రాజధానిలో వెనుకబడిన తరగతుల కులాల కు నగరానికి కూతవేటు దూరంలో రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల చెందిన సుమారు 80 ఎకరాల భూమిని కేటాయిస్తూ 40 కులాల ఆత్మగౌరవ భవనములు నిర్మించుటకు 80 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ భవనాల నిర్మాణం త్వరితగతిన చేపట్టుటకు సంబంధిత రెవెన్యూ హద్దులు ఏర్పాటు చేసి రెవెన్యూ భూకేటాయింపు చేసి వారి కుల సంఘ బోర్డులు ఏర్పరచాలని మంత్రి ఆదేశించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ …రెడ్డి, వైశ్య సంఘ నిర్మాణం చేపట్టే విషయంలో ఆ సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాల మాదిరిగానే ఈ వెనుకబడిన తరగతుల కులాల తో కూడా అటువంటి ఒప్పందాలు కుదుర్చు కొనుటకు కోరినారు. తదుపరి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలు సిద్ధం చేయుటకు మరియు మూడు నాలుగు రోజులలోనే గౌరవ మంత్రివర్యులు మరియు ఇంజనీరింగ్ అధికారులు మరియు ఇతర అధికారులు మరియు సంఘ ప్రతినిధులతో స్థలాలను పరిశీలించుటకు వెళ్ళుటకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల విషయంలో ముఖ్యమంత్రి దార్శనికతను మరియు ముందు చూపును దృష్టి యందు ఉంచుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ శ్రీమతి అనితారామచంద్రన్ , అదనపు కార్యదర్శి శ్రీ సైదా , మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ విద్యాసాగర్ , రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్ , కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అలోక్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -