ప్రజలను విచ్ఛిన్నం చేసే కుట్ర: మంత్రి గంగుల

193
gangula kamalakar
- Advertisement -

తెలంగాణ ప్రజలను విచ్ఛిన్నం చేసేందుకు, కొట్లాటలు సృష్టించేందుకే ఆంధ్రా పార్టీలు ఇక్కడ అడుగుపెడుతున్నాయని మండి పడ్డారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఆంధ్రా నాయకులకు పెత్తనం వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని తెలిపారు గంగుల. సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు జగనన్న వదిలిన బాణం అంటూ షర్మిల…. రేపు జగన్‌ …..తరువాత చంద్రబాబు వస్తాడు… ఆంధ్రా నేతలకు అధికారం ఇస్తే మన నీళ్లు, కరెంట్‌ను ఎత్తుకుపోతారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను కాపాడుకోకపోతే మళ్లీ సమైక్య రాష్ట్రం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.

- Advertisement -