కేంద్రం వెంటిలేటర్స్ అందజేయాలి- మంత్రి ఈటెల

216
etela
- Advertisement -

కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబేతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల కేంద్ర మంత్రికి మూడు విజ్ఞప్తులు చేశారు.
ఇందులో 1000 వెంటిలేటర్స్ కోసం అడిగాం ఇంకా రాలేదు అని వెంటనే అందజేయాలని కోరారు. ఐటీఎంఎస్‌ 1500 పడకల ఆసుపత్రి ప్రారంభం అయ్యింది కాబట్టి వీటి అవసరం ఉందని మంత్రి ఈటెల తెలిపారు.

పీపీఈ కిట్స్, ఎన్‌ -95 మాస్క్ లు హెచ్‌సీఎల్‌ నుండి అందిస్తామని కేంద్రం తెలిపింది.. కానీ తగినంత రావడం లేదు వెంటనే చొరవ తీసుకోవాలని.. ఎక్కువ మొత్తంలో అందజేయాలని విజ్ఞప్తి మంత్రి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పీపీఈ కిట్స్, ఎన్‌-95 మాస్క్ లు పెద్ద ఎత్తున సేకరిస్తుంది కానీ ఎక్కువ ధరకు కొనవలసి వస్తుంది, అదే కేంద్రం అందిస్తే రాష్ట్రంపై భారం తగ్గుతుందని మంత్రి ఈటెల తెలిపారు.

- Advertisement -