బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిపై మంత్రి ఈటెల సమీక్ష..

206
- Advertisement -

బీబీ నగర్ ఎయిమ్స్ ఆసుపత్రిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ మరియు ఇతర డాక్టర్లతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, అకడమిక్ వివరాలను మంత్రికి వివరించారు ఎయిమ్స్ డైరెక్టర్. ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు, నిర్వహణ సమస్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.

నీటి సరఫరా, బిల్డింగ్ నిర్మాణం, ఇతర సమస్యలు లేకుండా చూస్తామని.. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శినీ మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఎఐఎంఎస్ గవర్నింగ్ బాడీ మెంబర్ బండ ప్రకాష్ , వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, బీబీ నగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అనంత రావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ పాల్గొన్నారు.

- Advertisement -