తెలంగాణలో కరోనా నివారణ చర్యలపై కేంద్రం హర్షం..

223
etela
- Advertisement -

కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్.నిర్వహించారు. ఈ సమావేశంలో బూర్గులరామకృష్ణారావు భవన్ నుండి వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్య విద్యా సంచాలకులు డా రమేష్ రెడ్డి, ప్రజావైద్య సంచాలకులు డా శ్రీనివాస్ రావు, కరోనా నిపుణుల కమిటీ సభ్యులు డా కరుణాకర్ రెడ్డి, డా గంగాధర్ హజరైయ్యారు. తెలంగాణ తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పలు అంశాల్లో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను అభినందించారు కేంద్ర మంత్రి హర్షవర్ధన్.

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణకు మీ సపోర్ట్ ఇంకా కావాలి అని అన్నారు. రాష్ట్రంలో 1/8 మందికి పరీక్షలు చేసాము. 65 RTPCR labs పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 48 లక్షల టెస్టులు చేయడం జరిగింది.అందులో 5శాతం మాత్రమె పాజిటివ్ వచ్చింది. 2.5లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 19వేల ఆక్టీవ్ కేసులు ఉన్నాయి. డెత్ రేట్ 0.55శాతంగా ఉంది అని మంత్రి అన్నారు.

డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మరియు chc, phc, సబ్ సెంటర్స్ అన్ని చోట్లా కరోనా టెస్టులు చేస్తున్నాం. మా రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు,అన్ని హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ సీలిండర్స్ అందుబాటులో ఉన్నాయి. మేము అన్ని రకాల ట్రీట్మెంట్ సౌకర్యాలు సమకూర్చుకున్న హాస్పిటల్స్ లో 12-15శాతం బెడ్స్ మాత్రమే ప్రస్తుతం అక్యుపెన్సీ ఉన్నాయి. ముందు ముందు రోజుల్లో కరోనా కేసులు పెరిగినా కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ఎర్పాట్లు చేసుకున్నాం. మా సిబ్బంది అంత సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. అలాగే వ్యాక్సిన్ కి సంబంచిన డీటెయిల్స్ మరియు సప్లై అండ్ ప్రియార్టీ కి సంబంధించిన సమాచారం కూడా మాకు ఇవ్వాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరారు.

- Advertisement -