తెలంగాణ దేశానికే దిక్సూచి- మంత్రి ఈటల

441
elela
- Advertisement -

కరోనా వైరస్ కట్టడికి దేశంలో పకడ్బందీగా పని చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదట కోరింది తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా లాక్ డౌన్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్రం అని మంత్రి తెలిపారు. మర్కజ్ గురించి కూడా కేంద్రానికి సమాచారం అందించింది కూడా తెలంగాణనే. దేశానికే తెలంగాణ దిక్సూచి అని మంత్రి అన్నారు.

వెయ్యికి పైగా మంది మర్కజ్ కి వెళ్లినట్లు తెలిసింది. 160 మందిని తప్ప అందరినీ గుర్తించాం. కేవలం రెండు రోజుల్లోనే ఇంత మందిని గుర్తించి, పరీక్షలు చేయిస్తున్నాము అంటే తెలంగాణ ప్రభుత్వం సత్తా, చిత్తశుద్ది అర్దం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు.

గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాసిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి నెగెటివ్ వచ్చింది. మరో సారి పరీక్ష చేసి డిశ్చార్జ్ చేస్తామని మంత్రి తెలిపారు. అంతేకాదు ఈ రోజు మరో ఇద్దరు గాంధీ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు. డిశ్చార్జ్ అయిన వారందరూ మరో 14 రోజులు హోమ్ క్వారంటిన్‌లో ఉండాలి. ఇప్పటివరకు తెలంగాణ లో 6 గురు కరోనాతో చనిపోయారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

- Advertisement -