సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలి: మంత్రి ఈటెల

252
Minister Etela Rajender
- Advertisement -

ఈ రోజు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్స్ సూపరింటెండెంట్ లు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, పీసీహెచ్‌ మెడికల్ ఆఫీసర్స్ తో సచివాలయం నుండి విడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అన్నీ ఆసుపత్రుల్లో రెండు ఓపీలు ఉండాలన్నారు. అందులో ఫీవర్ ఓపీ, సాధారణ ఓపీలు ఉండాలని మంత్రి తెలిపారు.

కరోనా భయం నుండి ప్రజలను బయటపడవేయాలి.లక్షణములు లేని పాజిటివ్ వ్యక్తులకి ఇంటివద్దనే చికిత్స అందించాలి. జిల్లా ఆసుపత్రుల లోనే ఐసొలేషన్ ఉంచాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గాంధీకి పంపించాలని జిల్లా అధికారులకు మంత్రి సూచించారు.

- Advertisement -