రైతుల కోసమే సీఎం కేసీఆర్ తపన: మంత్రి ఎర్రబెల్లి

247
errabelli
- Advertisement -

రైతుల కోసమే సీఎం కేసీఆర్ తపన అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌తో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం చెన్నారావుపేట మండలం అమీనాబాద్, నర్సంపేట మండలం ముథోజిపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి …సీఎం కేసీఆర్ ముందుచూపుతో కొనుకోగలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి గ్రామాల నుండి బయటకురావద్దన్నారు.

ప్రజల కష్టసుఖాలలో ప్రభుత్వం భాగం పంచుకుంటుందని… 3 వేల కోట్లతో మక్కల కొనుగోలుకు ఇబ్బందులు రాకుండా చూశామని తెలిపారు. రాష్ట్రంలోనే నర్సంపేటలో అత్యధికంగా మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. నాలుగు నెలలుగా ఎస్సారెస్పీ కాలువ వరదలా పారుతుందని…కాళేశ్వరంతో ఉమ్మడి వరంగల్ జిల్లా సస్యశ్యామలం అయిందనన్నారు. రైతులకోసం ఏం చేసేందుకయినా ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.

- Advertisement -