కరోనా పరీక్షలు చేయించుకున్న మంత్రి ఎర్రబెల్లి…

130
dayakarrao
- Advertisement -

వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని ఓ హాస్పిట‌ల్ లో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. ఈ సందర్భంగా మంత్రికి యాండీ జెన్ కార్డు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాయి హాస్పిట‌ల్ వ‌ర్గాలు.

మంత్రి ఎర్ర‌బెల్లికి నెగెటివ్ వ‌చ్చిన‌ట్లుగా నిర్ధారించారు వైద్యులు. తాను విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ, ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఉంటున్నందున ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకున్నానని తెలిపారు మంత్రి. ప్ర‌జ‌లు కూడా నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే కోవిడ్ కి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉంద‌ని, చాలా వ‌ర‌కు త‌గ్గింద‌ని, భ‌యాందోళ‌న‌లు లేవ‌ని తేల్చి చెప్పారు.

- Advertisement -