ప్రజా నాయకుడు సర్వాయి పాపన్న: ఎర్రబెల్లి

250
errabelli
- Advertisement -

సర్వాయి పాప‌న్నఆనాడే పీడిత తాడిత ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడిన నాయ‌కుడ‌ని, ఆయ‌న మ‌న ప్రాంతానికే చెందిన వాడు కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

వర్ధన్నపేట మండలం ఇల్లందలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, స‌ర్వాయి పాప‌న్న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం అదృష్టం అన్నారు. స‌ర్వాయి పాప‌న్న ఆద‌ర్శంగా నేడు కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ సాధించ‌డ‌మేగాక‌, పేద ప్ర‌జ‌ల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న‌ద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, గౌడ సంఘం నేత‌లు పాల్గొన్నారు.

- Advertisement -