నాటిన ప్రతిమొక్కను సంరక్షించండి: ఎర్రబెల్లి

210
haritha haram errabelli
- Advertisement -

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం క్రాస్ రోడ్డు నుంచి చేల‌ప‌ర్తి గ్రామం వ‌ర‌కు 14కి.మీ. మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి…. నాటిన మొక్కలను వంద శాతం బతికించాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఊరూరా మంకీ ఫుడ్ కోర్టులు, యాదాద్రి మోడల్, విలేజ్ పార్కులను ఏర్పాటు చేయాలని చెప్పారు.

మొక్కలను సంరక్షించని ప్రజాప్రతినిధులు, అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు మొక్కలను రక్షించడమే ధ్యేయంగా గ్రామాల్లో పని చేయాలని ఆయన సూచించారు.

- Advertisement -