సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి

152
errabelli
- Advertisement -

జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మ క్క పల్లె లోని శ్రీ సీతారామ ఆంజనేయ దేవస్థానంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంత్రికి ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ పూజారులు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, అతి పురాతన దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరు కావడం తన పూర్వ జన్మ

సుకృతం అన్నారు. చాలా కాలంగా పస్కురి రామ్ మోహన్ రావు గారు ఈ దేవాలయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. భక్తి, ముక్తి కి మార్గమని, దైవ సన్నిధి, భక్తి మంచి సమాజానికి దారి తీస్తుందన్నారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -