TRS ఆఫీసు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి..

157
minister errabelli
- Advertisement -

ఆదివారం నిర్మాణంలో వున్న జనగామ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. నిర్మాణంలో పలు సూచనలు చేశారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. త్వరలో సీఎం కేసీఆర్,మంత్రి కెటీఆర్ ల చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామని తెలిపారు.

కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యమైంది. అతి త్వరలో కార్యాలయాన్ని పూర్తి చేసి కార్యకర్తలకు,నాయకులకు అందుబాటులోకి తెస్తాం. కరోనా సెకండ్ వేవ్ చలికాలం కారణంగా విజృంభిస్తోంది ప్రజలు జాగ్రత్తగా వుండాలి. మాస్కులు ధరిస్తూ…భౌతిక దూరం పాటిస్తూ…తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారిని అరికడుదామని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

- Advertisement -