10 నెలల్లో అందుబాటులోకి కాజిపేట బ్రిడ్జి..

185
errabelli
- Advertisement -

10 నెలల్లో కాజిపేట బ్రిడ్జి పనులు పూర్తవుతాయని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాజీపేట బ్రిడ్జి ప‌నుల‌ను ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రితో క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డి కూలీలు, కాంట్రాక్ట‌ర్ల‌తో మాట్లాడారు మంత్రి, ఎమ్మెల్సీ.ప‌నులు ఎప్ప‌టిలోగా పూర్తి చేస్తార‌ని వాక‌బు చేసిన మంత్రి…మ‌రో 10 నెల‌ల్లోగా ప‌నులు పూర్త‌వుతాయ‌ని మంత్రికి వివ‌రించారు కాంట్రాక్ట‌ర్.

ప‌నులు వేగంగా, నాణ్య‌త‌తో జ‌ర‌గాల‌ని ఆదేశించారు మంత్రి ఎర్రబెల్లి. కాజీపేట బ్రిడ్జి పూర్త‌యితే ట్రాఫిక్ స‌మ‌స్య త‌గ్గ‌డ‌మేగాక‌, పాత బ్రిడ్జీపై కొంత భారం త‌గ్గుతుంద‌ని, ప్ర‌యాణీకుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని తెలిపారు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.

- Advertisement -