శాంతియుత ఉద్యమాలకు స్ఫూర్తి …దీక్షా దివస్

159
errabelli
- Advertisement -

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ గారు… చావు నోట్లో తల పెట్టీ, ‘తెలంగాణ వచ్చుడో… కేసిఆర్ సచ్చుడో’ అనే నినాదంతో నవంబర్ 29, 2009 న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష… తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పి0దని, చరిత్ర గతినే మార్చి వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. అప్పటిదాకా నడుస్తున్న శాంతియుత ఉద్యమానికి, ఒక సత్యాగ్రహ ఆయుధం లా మారిందన్నారు. మొత్తం ప్రజలని ఏకం చేసి, ఆనాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిన ఆనాటి కెసిఆర్ దీక్ష చేపట్టిన రోజుని దీక్షా దివస్ గా జరుపుకోవడం, ఆనాటి ఆ కెసిఆర్ త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడమే అన్నారు. ఈ రోజు కి దీక్షా దివస్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అప్పటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఒళ్ళు పులకరిస్తుంది అన్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను కూడా మరువలేమని మంత్రి అన్నారు.

తెలంగాణ సాధించిన కెసీఆర్ సీఎం గా తెలంగాణను అదే ఉద్యమ స్ఫూర్తి తో బంగారు తెలంగాణ చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అద్భుతమైన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. సీఎం కెసిఆర్ గారి త్యాగ నిరతికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అంత గొప్ప మహా మనిషి మనకు సీఎం గా ఉండటం మన అదృష్టమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

- Advertisement -