కేంద్రానికి మంచి బుద్ధి ప్రసాదించాలి.. అమ్మ వారిని కోరిన మంత్రి..

83
Minister Errabelli
- Advertisement -

వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు! తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎమ్మెల్యే రమేశ్ భద్రకాళి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రమేశ్‌ను ఆయు ఆరోగ్యాలతో, ప్రజా జీవితంలో సుదీర్ఘంగా కొనసాగాలని ఆశీర్వదించి, అభినందించారు మంత్రి ఎర్రబెల్లి.

ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే రమేశ్‌ను సత్కరించగా, ఎమ్మెల్యే రమేశ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఘనంగా సన్మానించారు. అనంతరం అమ్మవారి కి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత మంత్రి, ఎమ్మెల్యేలను ఆలయ పూజారులు ఆశీర్వచనం ఇచ్చి, ఫల పుష్ప ప్రసాదాలు అందచేశారు.అంతకుముందు మంత్రికి ఆలయ అధికారులు, పూజారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ పాలన చల్లగా పది కాలాల పాటు కొనసాగాలని, కేంద్రానికి మన రైతాంగం, రాష్ట్రం పై వివక్ష తొలగి, మంచి బుద్ధి ప్రసాదించాలని భద్రకాళి అమ్మ వారిని కోరుకున్నట్లు చెప్పారు.

- Advertisement -