సీఎం కేసీఆర్ దేశంలోనే చరిత్ర సృష్టించారుఃమంత్రి ఎర్రబెల్లి

410
errabelli dayakar
- Advertisement -

భూ రికార్డుల ప్రక్షాళనతో సీఎం కేసీఆర్ దేశంలోనే చరిత్ర సృష్టించారన్నారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కొన్ని రాజకీయ పార్టీలు సంఘాలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.

భూముల నిజమైన హక్కుదారులకు ఎక్కడా ఇబ్బంది రావద్దు. వారం రోజుల్లోనే అన్ని గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తాం. మంత్రిగా నా బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వహించి నియోజకవర్గాన్ని, ముఖ్యంగా తొర్రూరును అభివృద్ధి చేస్తానని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -