పార్టీలకతీతంగా అందరూ పాల్గొనాలిః మంత్రి ఎర్రబెల్లి

372
errabelli
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళిక కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గోనాలని సూచించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మంత్రి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని చెప్పారు. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

కేవలం మూడున్నర సంవత్సరా వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. . ఈ రోజు రెండోసారి అధికారం చేపట్టాక గ్రామ సీమలు బాగుచేయాలని ఛాలెంజింగ్‌గా తీసుకుని పెద్దఎత్తున ముందుకు పోతున్నామన్నారు. డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, చెత్త సేకరణ, మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్ కొనిచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

- Advertisement -