సైక్లింగ్ పోటీలో మంత్రి ఎర్రబెల్లి..

60
- Advertisement -

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సైక్లోథాన్ వరంగల్ 2022, సైకిల్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,నగర మేయర్ గుండు సుధారాణిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, సీపీ తరుణ్ జోషి లతో కలిసి సైకిల్ తొక్కారు. ఈ సైక్లింగ్ పోటీ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, పలువురు ప్రముఖులు, పోటీ పడుతున్న యువత పాల్గొన్నారు.

- Advertisement -