పల్లె ప్రకృతి వనాలకు మంచి స్పందన- మంత్రి ఎర్రబెల్లి

100
- Advertisement -

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలోని మండలాలలో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి &గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించడానికి రాష్ట్రంలో 116 కోట్ల రూపాయల వ్యయంతో 19,472 పల్లె ప్రకృతి వనరుల నిర్మాణాన్ని చేపట్టడం జరగగా, 19,413 (99.9%) పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన తెలిపారు. నిర్మాణంలో ఉన్న మిగతా 59 పల్లె ప్రకృతి వనాలను పూర్తిచేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.

పల్లె ప్రకృతి వనాలకు గ్రామీణ ప్రజల నుండి మంచి స్పందన రావడంతో మండలానికి ఒకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని మంత్రి తెలిపారు. మండల కేంద్రంలో గాని లేదా మండల కేంద్రంలో భూమి లభించినట్లయితే మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీలో పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయబడతాయని ఆయన తెలిపారు. ఒక్కొక్క పల్లె ప్రకృతి ఏర్పాటు చేయడానికి 40 లక్షల రూపాయలు వ్యయం చేయబడతాయని ఆయన తెలిపారు.

ఒక ప్రకృతి వనంలో దాదాపు 31,000 మొక్కలను పెంచుతామని తెలిపారు. అందు నిమిత్తం ఇప్పటివరకు 535 మండలాలలో పది ఎకరాల చొప్పున ఐదు వేల 300 ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. మిగతా పది మండలాల్లో భూమి ఎంపిక ప్రక్రియ వెంటనే పూర్తవుతుందని ఆయన తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాల వల్ల ఏ గ్రామానికి వెళ్లిన పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. హరితహారం శోభ ఇనుమడిస్తూన్నదని మంత్రి అన్నారు.

- Advertisement -