కూలీలతో మమేకమైన మంత్రి..

71
minister errabelli
- Advertisement -

ఆయన జనాన్ని చూస్తే… మంత్రి నన్న విషయం కూడా మరచిపోతారు. జనంలో ఇట్టే కలిసి పోతారు. వాళ్ళలో ఒకడిగా మసలుకుంటారు. వాళ్ళతో మమేకం అయిపోతారు. ఇది ఎవ్వరి గురించో తెలిసే ఉంటుంది. మీరు ఊహించింది నిజమే రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురించే.. మంగళవారం ఆయన వరంగల్ ఎంజీఎంలో సిటీ స్కాన్‌ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్‌లో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబరంలో శిక్షణ పొందుతున్న వాళ్ళకి స్టడీ మెటీరియల్ అంద చేయడానికి వెళుతుండగా.. మార్గమధ్యంలో, పర్వతగిరి మండలం తుర్కల సోమారం గ్రామం నల్లకుంట తండా వాసులు, తమ చెరువులో పూడికతీత పనులు చేస్తున్న దృశ్యాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చూశారు.

వెంటనే వాహనాన్ని ఆపి కూలీల దగ్గరకు వెళ్లారు. ఉపాధి హామీ కూలీలను ఆప్యాయంగా పలకరించారు. ఉపాధి కూలీల సమస్యలు ఎమైనా ఉన్నాయా? అని అడిగారు. ఉపాధి హామీ బిల్లులు సకాలంలో వస్తున్నాయా? ఎంత కాలంగా రాలేదు? అని ఆరా తీశారు. ప్రతి రోజూ ఏ సమయం నుండి ఏ సమయం వరకు పని చేస్తున్నారు? అని అడిగారు. ఆ తర్వాత వాళ్ళతో కలిసి గడ్డ పార అందుకున్నారు. పక్కనే కూలీలు వేస్తున్న మాదిరిగానే గడ్డపార వేసి, మట్టి పెళ్ళలను పెకిలించారు. తట్ట పట్టి మట్టి ఎత్తారు. దీంతో అక్కడి కూలీలు అంతా ఆశ్చర్య పోయారు. వారు తేరుకునే లోగానే మంత్రి మరో కార్యక్రమానికి బయలుదేరారు.

- Advertisement -