15 రోజులలో మాస్టర్ ప్లాన్ సిద్దంః మంత్రి ఎర్రబెల్లి

629
Errabelli
- Advertisement -

15రోజుల్లో వరంగల్ అర్బన్ జిల్లా మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేయనున్నట్లు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హన్మకొండలోని కలెక్టరేట్ లో మాస్టర్ ప్లాన్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటిల్, మున్సిపల్ కమిషనర్ రవి కిరణ్ పలువురు అధికారులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల కోసం మాస్టర్ రూప కల్పన జరుగుతుందన్నారు. 2041 మాస్టర్ ప్లాన్ తుదిదశకు చేరింది. ఇప్పటి వరకు 3500 మంది తమ అభిప్రాయలను తెలియపరిచారు. నెల రోజుల క్రితం కొన్ని మార్పులు చేయాలని నెల నిర్వహించుకున్నాము ఈ రోజు మార్పులు చేశాం. ప్రధాన లోపాలను ఈ రోజు గుర్తించినట్లు తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్ లో 272 చెరువులు ఉన్నాయి . శిఖం భూముల ప్రభుత్వం కాపాడుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు కలుపుకొని మాస్టర్ ప్లాన్ తయారు చేశాం.

చెరువుల ను మరమ్మతులు చేపట్టి అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని దేవాదాయ భూములకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. దేవాలయ భూములు కొంత మంది అక్రమించు కున్నారు. కేసీఆర్, కేటీఆర్ జిల్లా అభివృద్ధి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో లోపాలు ఉంటే ప్రజలు ఫిర్యాదు చేయాలని చెప్పారు.

- Advertisement -