తెలంగాణపై కేంద్రం క‌క్ష సాధింపు చ‌ర్య‌లు..

55
ministers
- Advertisement -

కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌ను మానుకోవాలి. ఉపాధి హామీ నిధుల‌లో కోత విధించ‌కుండా, గ‌త ట్రాక్ రికార్డు ఆధారంగా, ఇప్పుడు జ‌రుగుతున్న ప‌నుల‌ను చూసి రాష్ట్రానికి క‌నీసం 16 కోట్ల ప‌నిదినాల‌ను ఆమోదించాలి. అలాగే ప్ర‌జోప‌యోగ ప‌నులు చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్స‌హించాల‌ని ఉపాధి హామీ కౌన్సిల్ తీర్మానించింది. అలాగే, ఉపాధి హామీని వ్య‌వ‌సాయానికి అనుసంధానించాలి. అర్బ‌న్ ప్రాంతాల‌కు కూడా ఉపాధి హామీ చేసుకునే వీలు క‌ల్పించాలి. గ‌తంలో లాగే, ఎస్సీ, ఎస్సీల‌కు సెప‌రేట్ గా పేమెంట్స్ ఇవ్వాలి. ప‌ని జ‌రిగే ప్రాంతాల్లో ఫోటోలు తీయ‌డం, పంప‌డం వంటి ఇబ్బందిక‌ర చ‌ర్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలి. ఇప్ప‌టికే బ‌కాయిలుగా ఉన్న 97 కోట్ల 35ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను వెంట‌నే చెల్లించాలి అని ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ స‌మావేశం కేంద్రాన్ని కోరింది.

సోమవారం రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధ్య‌క్ష‌త‌న హైద‌రాబాద్ లోని రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ హాలులో ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్‌, మ‌ల్లారెడ్డి, ఈజిఎస్ స్టేట్ డైరెక్ట‌ర్లు అందె యాక‌య్య‌, స‌ద్గుణ ర‌వింద‌ర్‌, వెంక‌ట‌నారాయ‌ణ గౌడ్‌, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజ‌న సంక్షేమ‌శాఖ కార్య‌ద‌ర్శి క్రిష్టినా జ‌డ్‌ చోంగ్తు, క‌మిష‌న‌ర్ శ‌ర‌త్‌, ఇజిఎస్ స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద్‌, ఇఎన్‌సి సంజీవ‌రావు, ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ స‌మావేశం అనంత‌రం మంత్రులు మీడియాతో మాట్లాడారు.

ఉపాధిహామీ నిధుల వినియోగంలో దేశంలో మనమే నెంబర్ వన్ గా ఉన్నాం. అత్యధికంగా కూలీలకు పని దినాలు కల్పిస్తున్న రాష్ట్రం కూడా మన తెలంగాణే. తెలంగాణ‌లో అడిగిన వారందరికి కొత్త జాబ్ కార్డులు ఇస్తున్నాం. కూలీలు కూడా ఉపాధి కోసం డిమాండ్ చేస్తున్నారు. క‌రోనా క‌ష్ట కాలం తర్వాత తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు, ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌ట్ట‌ణాల నుంచి ప‌ల్లెల‌కు వాప‌స్ వ‌ల‌స పోతున్నారని మంత్రులు చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయవద్దు అనే క్లారిటి ఉండేది కాదు. తెలంగాణకు ముందు అవసరం లేని పనులు, ఉపయోగంలో లేని వాటికి ఉపాధిహామీ పనులు చేసిన సందర్భాలు ఉండేవి. తెలంగాణ వచ్చిన తరువాత ప్రజలకు అవసరమయ్యే పనులకు ఉపాధిహామీ నిధులను, కూలీలను ఉపయోగిస్తున్నాం. నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు కళ్లాలు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు వంటి పనులకు ఉపాధిహామీని ఉపయోగిస్తున్నామ‌ని మంత్రులు చెప్పారు.

గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో 11 కోట్లకు మించి పనిదినాలు ఉండేవి కావు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి సంవత్సరంలోనే 10 కోట్ల 39 లక్షల పనిదినాలు కల్పించాము. అలాగే 2021-22 ఏడాదిలో 15 కోట్ల పనిదినాలు, 4 వేల 395 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరపు బడ్జెట్ లో ఉపాధిహామీకి 25 వేల కోత పెట్టింది. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనీ ఎన్నిసార్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేదు. లేబర్ బిల్లులు కూడా రాష్ట్రానికి సంబంధం లేకుండా డైరెక్ట్ గా కూలీల అకౌంట్ లలోకి పంపించడం అన్యాయం. గతంలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారిగా పేమెంట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ కేటగిరీలు కూడా తొలగించారు. పని జరిగే ప్రదేశాల ఫోటోలు పెట్టాలని కొత్త రూల్ కేంద్ర ప్రభుత్వం పెడుతోంది. ఇది సాధ్యం కూడా కాదని మంత్రులు అభిప్రాయ‌ప‌డ్డారు.

మ‌రోవైపు బ‌కాయీలు కూడా చెల్లించ‌క‌పోగా, రాష్ట్రాన్ని బ‌ద్‌నామ్ చేస్తున్నారు. అవ‌గాహ‌న లేకుండా బండి సంజ‌య్ వంటి నేత‌లు మాట్లాడుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 97 కోట్ల 35 లక్షల లేబర్ పేమెంట్ కూడా పెండింగ్ లో ఉంది. ఆ నిధులు ఇచ్చేది కూడా కేంద్ర‌మే. రాష్ట్రం కాదు. క‌నీస జ్ఞానం లేని వారు మాట్లాడే మాట‌ల‌కు విలువ లేద‌ని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా 18 వందల 30 కోట్ల నుండి 13 వందల 80 కోట్లకు తగ్గించారు. దాదాపు 500 కోట్ల కోత విధించారు. దీంతో గ్రామ పంచాయ‌తీలకు అందాల్సిన డ‌బ్బులు ఆల‌స్య‌మ‌వుతున్నాయ‌ని మంత్రి చెప్పారు.

కొన్ని చోట్ల స‌ర్పంచ్ లు త‌మ‌కు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేద‌ని అంటున్నారు. రోడ్ల మీద‌కు వ‌స్తున్నారు. మీడియాకెక్కుతున్నారు. వాస్త‌వానికి ఆ నిధులు ఇచ్చేది కేంద్రం. అది మ‌న రాష్ట్రాల హ‌క్కు. అందుకు స‌రిస‌మానంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మ‌న రాష్ట్రంలో సిఎం కెసిఆర్ నిధులు ఇస్తున్నారు. అయితే, కేంద్రం నుండి నిధులు రాక‌పోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే స‌మ‌స్య వ‌చ్చింది. ఆ స‌మ‌స్య ప‌రిష్కారానికి మంత్రులుగా మేం, అధికారులు కూడా కృషి చేస్తున్నారు. త్వ‌ర‌లోనే కేంద్రం పెండింగ్ బిల్లుల‌ను తెప్పిస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. స‌ర్పంచ్ లు సంయ‌మ‌నం పాటించాల‌ని, ఆందోళ‌న చెంద వ‌ద్ద‌ని ఆయ‌న అన్నారు.

ఇక కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ లో 3 లక్షల 50 వేలు పెండింగ్ లో ఉన్నాయ‌ని ఒక మీడియాలో వచ్చిన వార్త ను మంత్రి ఖండించారు., ఆ వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. కేవలం 86 వేలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. అది కూడా 29 ఎప్రిల్ లో జనరేట్ చేసినవి. ఈ రోజుల పెండింగ్ బిల్లుల‌ను కూడా తెప్పిస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు.

- Advertisement -