ఆ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందిః మంత్రి ఎర్రబెల్లి

607
errabelli dayakar rao
- Advertisement -

రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలో మంత్రి పర్యటించారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అన్నారు. రైతు భీమా పథకం రైతులకు భరోసాగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.

జనవరి తర్వాత గోదావరి జలాలతో చెరువులన్నీ నింపుతామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల అభివృద్దికి భారీగా నిధులు సమకూర్చినట్లు తెలిపారు.

- Advertisement -