మొక్కలు నాటిన మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి….

292
shiva green challenge
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణి కొండ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఒక యుద్దంలా పర్యావరణ ప్రేమికులు అంతా ముందుకు తీసుకెళ్తున్నారు అని తెలిపారు.

ఇంతటి కార్యక్రమం లో తననూ భాగస్వామిని చేసిన, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.అదే విధంగా , ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకు పోవడంలో భాగంగా , హాస్యనటుడు ఆలీ, కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలహాసన్ రెడ్డి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, పాటల రచయిత కాసర్ల శ్యామ్ మరియు తన సోదరుడు కళాకారుడు సంపత్ కు మూడు మొక్కలు నాటే ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -