మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం..

443
mettu
- Advertisement -

రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా శ్రీ మెట్టు శ్రీనివాస్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా శ్రీ మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా తనను నియమించినందుకుగాను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు రావుల శ్రీధర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ గా తనను నియమించినందుకుగాను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు మెట్టు శ్రీనివాస్. వీరు మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

- Advertisement -