హీరోయిన్ల సెక్స్ రాకెట్‌పై మెహ్రీన్ సంచలన వ్యాఖ్యలు..

622
- Advertisement -

టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్స్‌తో కలిసి కిషన్ మోదుగుముడి దంపతులు నిర్వహించిన సెక్స్ రాకెట్‌ బయటకు రావటం.. పెను సంచలనంగా మారటమే కాదు.. అమెరికాలో నిర్వహించే కల్చరల్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వీసాల కోసం అప్లై చేసుకున్న వారికి రిజెక్ట్ చేయటం తెలిసిందే. ఈ విషయంపై హీరోయిన్ మెహ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాంకోవర్ నుంచి లాస్ వెగాస్ వెళుతున్న తనను అమెరికా సరిహద్దు భద్రతాధికారులు విచారించారని, వారి నోటి నుంచే టాలీవుడ్ హీరోయిన్ల సెక్స్ రాకెట్ పై తొలిసారి సమాచారం విన్నానని గతంలో చెప్పిన మెహ్రీన్, మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయమై ఇంకాస్త వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

తాజాగా ‘పంతం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్ల వ్యభిచారంపై మెహ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేసిందంటూ ఓ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా, మెహ్రీన్ దాన్ని ఖండించింది. “ఈ కథనం పూర్తి అవాస్తవం. నేను ఆ ఇంటర్వ్యూను ఇవ్వలేదు. మీడియాతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అసలు ‘పంతం’ ప్రమోషన్ కార్యక్రమంలో నేను పాల్గొనలేదు. ఆ సమయంలో వైరల్ ఫీవర్ తో ముంబైలో ఉన్నాను” అని చెప్పుకొచ్చింది.

Mehreen Kaur

అసలేం జరిగిందో ఆమె మరోసారి వివరించింది..మా కుటుంబంతో కలిసి వాంకోవర్ నుంచి లాస్ వెగాస్ కు వీకెండ్ హాలిడే కోసం వెళ్లాను. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్దకు వెళ్లినప్పుడు నన్ను తెలుగు నటిగా గుర్తించారు. అక్కడి సరిహద్దు అధికారులు అమెరికాలో నా టూర్ కి కారణం ఏమిటని ప్రశ్నించారు. అప్పుడే తొలిసారి సెక్స్ స్కాండల్ గురించి తెలిసింది. ఆ ఇష్యూతో నాకు ఎలాంటి సంబంధం లేదని గుర్తించిన అధికారులు సారీ చెప్పి మరీ నా ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు.

అయితే ఇతరులు దీని గురించి చెప్పే కంటే నేనే చెప్పటం మంచిదని ఈ ప్రకటన చేస్తున్నా. నిజానికి అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నది వాస్తవమే అయినప్పటికీ.. అది నా వ్యక్తిగత అంశం. ఎవరో ఏదో చేసిన పనికి తెలుగు పరిశ్రమకి చెడ్డ పేరు రావటం బాధ కలిగిస్తోంది. తెలుగు ఇండస్ట్రీ నన్ను ఎంతగానో అదరించింది.. ఈ విషయంపై మాట్లాడటం ఇదే చివరిసారి అంటూ ముగించింది.

- Advertisement -