బాధలో మెగాస్టార్ ముద్దుల కూతురు

25
- Advertisement -

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ – నటి లావణ్య త్రిపాఠి వివాహం ఇటీవలే ఇటలీలోని టస్కనీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అలీ, మురళీమోహన్, నాగచైతన్య, దగ్గుబాటి పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, టి.సుబ్బరామిరెడ్డి, సుమ, సైనా నెహ్వాల్ ఇంకా తదితర ప్రముఖులు హాజరయ్యారు. అయితే, వరుణ్ – లావణ్య రిసెప్షన్‌ లో మొదటినుంచి చాలా యాక్టివ్ గా కనిపించిన మెగాస్టార్ ముద్దుల కూతురు శ్రీజ రిసెప్షన్ మధ్యలో నుంచే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

దీనికితోడు మెగా ముద్దుల కూతురు శ్రీజ పెట్టిన పోస్ట్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ‘మన పరిస్థితులు మనకే తెలియకుండా అస్తవ్యస్తంగా మారినప్పుడు కచ్చితంగా మన హృదయం గాయపడుతుంది’ అంటూ శ్రీజ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. పైగా శ్రీజ తన పోస్ట్ లో ఇంకా రాస్తూ.. ‘మనసు విరిగిపోతుందని మనసు కలత చెంది ఆపై క్షీణిస్తుందని.. అదే సమయంలో శరీరం కూడా అలసిపోయి బలహీనంగా తయారవుతుందని తెలిపింది. అసలు అలాంటి దుర్భర పరిస్థితిలో శ్రీజ ఎందుకు ఉంది అనేదే ఇక్కడ హాట్ టాపిక్. ఎదో విషయంలో శ్రీజ బాగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది .

అందుకే, ఆమె పై విధంగా పోస్ట్ లు పెట్టింది అని అంటున్నారు. అన్నట్టు శ్రీజ పోస్ట్ లో మరో పాయింట్ కూడా ఉంది. ‘మనతో మనమే కనెక్ట్ అయితే అన్నీ సెట్ అవుతాయని ఇదొక్కటే అలాంటి పరిస్థితుల నుంచి బయట పడటానికి మార్గమని శ్రీజ రాసింది. అసలు శ్రీజకు ఏమైంది? పెళ్లిలో సందడిగా గడిపిన ఆమె ఇంతలోనే ఇంత నిర్వేదం చెందాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి రిసెప్షన్ లోనే శ్రీజ బాగా ఫీల్ అయ్యింది.

Also Read:యాంకర్ బ్యూటీలు బిల్డప్ కామెంట్లు

- Advertisement -