తిరుపతిలో పరిస్థితులపై చిరు ఆవేదన..

72
Megastar
- Advertisement -

తిరుపతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల, తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. తిరుమల ఘాట్ రోడ్లలో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. తిరుపతిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. కుండపోత వర్షాల కారణంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులు కలచివేస్తున్నాయని చెప్పారు.

గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న వర్షాలతో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బాధిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు సమష్టిగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు.

- Advertisement -