గోపిచంద్‌తో తేజు క్రైమ్ థ్రిల్లర్‌..

257
Mega Hero Sai Dharam Tej to explore a new genre
- Advertisement -

నక్షత్రం,జవాన్,ఇంటిలిజెంట్ డిజాస్టర్‌లతో డీలా పడ్డ మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ తన నెక్ట్స్‌ సినిమాల కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కరుణాకరణ్‌తో మూవీ చేస్తున్న తేజు..తాజాగా విభిన్నకథా చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటీతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

‘ఐతే’ .. ‘అనుకోకుండా’.. ‘ఒకరోజు’ .. ‘మనమంతా’ వంటి విభిన్నమైన చిత్రాలతో మెప్పించిన చంద్రశేఖర్‌తో తేజు సినిమా చేయడంపై అంతా ఆసక్తితో ఉన్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Mega Hero Sai Dharam Tej to explore a new genre

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుంచి మొదలవ్వనుంది. మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ లాంటి గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని నిర్మాతలు అన్నారు. కొత్త జోనర్‌లో ఈ సినిమా ఉంటుందన్నారు. ఇప్పటి వరకూ సాయిధరమ్ తేజ్ చేయని కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందనుందని తెలిపారు. గోపీచంద్ ప్రస్తుతం మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో బిజీగా ఉన్నారని వెల్లడించారు.

- Advertisement -