తెలంగాణ ఆర్టిస్టులకు మంచి ఆదరణ లభిస్తుంది..

570
Tharun
- Advertisement -

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా షామీర్ సుల్తాన్‌ దర్శకత్వంలో కింగ్ ఆఫ్ హిల్స్ పతాకంపై విజయ్‌ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ చిత్రం గత శుక్రవారం రిలీజ్ అయ్యి థియేటర్స్ ని నవ్వుల వానలో నింపుతున్నాయి. తమ ప్రయత్నానికి ఇంత విజయం అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమం వరంగల్‌లో జరిగింది.

Meeku Matrame Chepta

ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ: మీకు మాత్రమే చెప్తా సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ వరంగల్ నుండి ప్రారంభించడం సంతోషంగా ఉన్నది. కొత్త డైరెక్టర్లను పోత్సహించాలి. సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ ఆర్టిస్టులకు మంచి ఆదరణ లభిస్తుంది అన్నారు హీరో, డైరెక్టర్ తరుణ్ భాస్కర్.

- Advertisement -