జాతీయ పండుగగా మేడారం: బండా ప్రకాశ్

225
banda
- Advertisement -

తెలంగాణ కుంభమేళ మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు టీఆర్ఎస్ ఎంపీ బండా ప్రకాశ్. రాజ్యసభలో మాట్లాడిన ఆయన మేడారంకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గిరిజనుల జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారంలో కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని..మేడారం అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మేడారం జాతరకు కోట్లాది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు.

- Advertisement -