అందరూ మాస్క్‌ దరిస్తూ సమాజిక దూరం పాటించాలి- మేయర్‌

95
- Advertisement -

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈరోజు నుండి తెలంగాణ అంతటా ఫీవర్‌ సర్వే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్‌లో ఫీవర్ సర్వే ను పరిశీలించారు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఈ కార్యక్రమంలో డెప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఎఎంహెచ్‌ఓ రవికాంత్, డీఎంహెచ్‌ఓ అనురాధ ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి ఆదేశాల మేరకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచనలతో ఈ రోజు నుండి ఫీవర్ సర్వే ప్రారబించడం జరిగింది. గతంలో 2 సార్లు నిర్వహించిన అనుభవంతో ఈ సారి కోడా వైద్య సిబ్బంది మరియు మున్సిపల్‌ సిబ్బంది కలిసి ఈ కార్యక్రమంను విజయవంతం చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.

జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్‌ కిట్ లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్ లకు ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ లలో 500 రూపాయలు మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఎవరైనా ఎక్కువగా కలెక్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్‌ ఆదేశించారు. 60 ఏళ్లపై పడిన వారందరూ బూస్టర్ డోస్‌ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అలాగే వ్యాక్సినేషన్ రెండవ డోస్‌ తీసుకొని వారందరూ తప్పనిసరిగా తీసుకోవాలి. రెండవ డోసు తీసుకున్న 9 నెలల తరువాత బూస్టర్ డోస్‌ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. నగర ప్రజలు మాస్క్‌ దరిస్తూ సమాజిక దూరం పాటించాలని మేయర్‌ కోరారు. 6 రోజులు బస్తిలలో 15 రోజులు మిగిలిన ప్రాంతాలలో ఫీవర్ సర్వే పూర్తి చేస్తాము. కిట్స్ ఇవ్వడంతో పాటు కొన్ని చోట్ల రాపిడ్ టెస్ట్ లు చేయలని మేయర్‌ ఆదేశించారు.

- Advertisement -