ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావొద్దు- మేయర్

690
Mayor Bonthu Rammohan
- Advertisement -

దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కర్ఫ్యూలో హైద్రాబాద్‌ జీహెచ్‌యంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన సతీమణి బొంతు శ్రీదేవి ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన ఇచ్చిన 24 గంటల స్వీయ నియంత్రణ విజయవంతం గా కొనసాగుతోంది.

విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి వైద్య సేవలు అందిస్తున్నాం.కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మన అందరం బాధ్యతగా వ్యవహరించుదాం. ఇళ్లనుంచి ఎవరు బయటకు రావొద్దు. రోడ్ల మీదికి ఎవరు రావొద్దు.స్వీయ క్రమశిక్షణతో కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చు అని మేయర్‌ పేర్కొన్నారు.

- Advertisement -